1.తులసి...
సనాతన ధర్మంలో తులసిని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. మరణించే వ్యక్తి శరీరం వద్ద గానీ, లేదా నోటిలో గానీ తులసి ఆకులు ఉంటే, ఆ వ్యక్తి ఆత్మ యమలోకానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని నమ్ముతారు. అందుకే, మరణ సమయంలో ఆ వ్యక్తిని తులసి మొక్క దగ్గర ఉంచడం, అలాగే అతని నుదుటిపై లేదా నోటిలో ఒక తులసి ఆకును ఉంచడం ఆచారంగా వస్తోంది.
గంగా జలం..
మరణ సమయంలో ఒకరి నోటిలో గంగా జలాన్ని పోసే సంప్రదాయం కూడా ఉంది. మతపరమైన విశ్వాసాల ప్రకారం, గంగా జలం శ్రీ మహా విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుంది. ఈ నీరు పాపాలను హరిస్తుందని నమ్ముతారు. గంగా జలాన్ని సేవించిన తర్వాత మరణించిన వ్యక్తి స్వర్గ ప్రాప్తి పొందుతాడని నమ్ముతారు.