దీంతో ఒక్క గుడ్డు రూ. 7కి విక్రయించినా లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల బెంగాల్, బిహార్, ఒడిశా, యూపీ వంటి రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఫామ్స్ పెరిగిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతులు తగ్గాయి. ఈ కారణంగా ఇక్కడ ఉత్పత్తి కూడా తగ్గింది. దీంతో డిమాండ్కు తగ్గట్లుగా గుడ్ల ప్రొడక్షన్ లేకపోవడంతో కూడా ధరలు పెరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.