సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, ప్రసూతి వైద్య బృందాలు కూడా గర్భిణీలకు కోవిడ్ -19 వ్యాక్సిన్లు వేయాలని సిఫార్సు చేస్తున్నాయి, వారికి కరోనావైరస్ సోకినట్లయితే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. వైరస్ సోకిన గర్భిణులు ఇంటెన్సివ్ కేర్లో చేరడం, ఇన్వాసివ్ వెంటిలేషన్ పొందడం అవసరం అవుతున్నాయన్నారు. అంతేకాదు వైరస్ బారిన పడిన మామూల మహిళలతో పోల్చితే వైరస్ బారిన పడిన గర్భవతులు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.