దోశెలు రెండుకు మించి తినకండి. ఉల్లిపాయ, టమాటా, పాలకూర, క్యాప్సికమ్ వంటి కూరగాయలు కలిపితే ఫైబర్ లభిస్తుంది. ఎక్కువ నూనె లేదా బటర్ తో కాకుండా, తక్కువ నూనెతో దోశ వేసుకోవడం మంచిది.
తెల్ల బియ్యం ఎక్కువగా వాడిన దోశ పిండి కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచొచ్చు. అందుకే, డాక్టర్ లేదా డైటీషియన్ సలహాతో చిరుధాన్యాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే పిండి రకాలను ఎంచుకోవచ్చు. చట్నీ కూడా ముఖ్యమే! కొబ్బరి చట్నీని మితంగా తీసుకోవచ్చు. కానీ, చక్కెర కలిపిన చట్నీలు, ఎక్కువ కార్బ్స్ ఉండే సైడ్ డిష్లకు దూరంగా ఉండటం మంచిది. కూరగాయల సాంబార్ తీసుకుంటే అదనపు ఫైబర్ అందుతుంది.