బియ్యం కడిగిన నీటిని పారేయకుండా జుట్టు సంరక్షణకు ఉపయోగించవచ్చు. ఇది జుట్టును స్మూత్గా, సాఫ్ట్గా మారుస్తుంది.
ఒక కప్పు బియ్యాన్ని కడిగి, రెండు మూడు కప్పుల నీటిలో కొంతసేపు నానబెట్టాలి. ఆ నీటిని వడకట్టి ఉపయోగించాలి.
జుట్టుకు షాంపూ చేసిన తర్వాత రైస్ వాటర్ను జుట్టు, స్కాల్ప్పై అప్లై చేసి కొన్ని నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయాలి.
రైస్ వాటర్ ని వారానికి ఒకసారి ఉపయోగిస్తే సరిపోతుంది. ప్రతిరోజూ ఉపయోగించాల్సిన అవసరం లేదు.
జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి బియ్యం నీళ్లు చక్కగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
మొదటిసారి బియ్యం నీటిని వాడేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. దురద, మంట లేదా ఎర్రబడటం వంటివి ఉంటే వెంటనే వాడటం ఆపేయాలి.
Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు
Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు
Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు
Curry Leaves: రోజూ ఈ ఒక్క ఆకు తిన్నా చాలు.. ఎన్ని లాభాలో?