దీపావళి కదా అని ఏమాత్రం కేర్ లెస్ గా ఉన్నా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి..మధుమేహం అదుపులో ఉండాలంటే ఇలా చేయాల్సిందే

Published : Oct 22, 2022, 03:05 PM IST

పండుగ సీజన్ కదా అని మెడిసిన్స్ వేసుకోకుండా.. టైం కి తినకండా.. ట్యాబ్లెట్లను వేసుకోకండా ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. అందుకే మధుమేహులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

PREV
16
దీపావళి కదా అని ఏమాత్రం కేర్ లెస్ గా ఉన్నా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి..మధుమేహం అదుపులో ఉండాలంటే ఇలా చేయాల్సిందే

30 లోకి అడుగుపెడితే చాలు.. లేని పోని రోగాలు రావడం షురూ అవుతాయి. ఎందుకంటే ఈ వయసులో నుంచే శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. దీనికి కారణం జీవన శైలి సరిగ్గా లేకపోవడం. అయినా ఈ రోజుల్లో గుండె జబ్బులు, ఒత్తిడి, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయి. ఒక వేళ మీకు డయాబెటీస్ ఉన్నట్టైతే.. మీ లైఫ్ స్టైల్ ను చాలా మార్చుకోవాల్సి ఉంటుంది. మధుమేహులు ఆరోగ్యం ఉండాలంటే.. రెగ్యులర్ గా ట్యాబ్లెట్లను వేసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం అంతే ముఖ్యం. అయితే పండుగ కదా అని కొంతమంది షుగర్ పేషెంట్లు  పూర్తిగా కేర్ లెస్ గా ఉంటారు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఈ దీపావళికి మధుమేహాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి. 
 

26

నీళ్లను తరచుగా తాగుతూ ఉండండి

పండుగతో సంబంధం లేకుండా నీళ్లను తరచుగా తాగుతూ ఉండాలి. ఎందుకంటే పండుగ హడావుడిలో పడి చాలా మంది నీళ్లను తాగడమే మానేస్తుంటారు. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి రోజూ నీళ్లను పుష్కలంగా తాగాలి. రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. అప్పుడే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
 

 

36
diabetes

స్వీట్లు, వేయించిన ఆహారాలు

దీపావళికి రకరకాల ఆహారాలు, వేయించిన ఆహారాలు గుమగుమలాడుతుంటాయి. కానీ మధుమేహులు తీపి పదార్థాలను, వేయించిన ఆహారాలను అస్సలు తినకూడదు. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. ఆరోగ్యకరమైన వాటినే తినండి. 

46

మధుమేహాన్ని నియంత్రిస్తుంది: మధుమేహంతో బాధపడేవారికి గోంగూర మంచి ఫలితాలను అందిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర నిల్వల స్థాయిని తగ్గించి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను (Insulin levels) పెంచుతుంది. దీంతో మధుమేహాన్ని (Diabetes) నియంత్రణలో ఉంచుతుంది. కనుక మధుమేహంతో బాధపడేవారు తరచూ గోంగూరను తీసుకుంటే మంచిది.
 

56

మందులను వేసుకోవడం మర్చిపోకూడదు

పండుగ ఆనందంలో కొంతమంది మెడిసిన్స్ ను వేసుకోవడమే మర్చిపోతుంటారు. కానీ రోజూ వేసుకోవాల్సిన వాటిని వేసుకోకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. 
 

66


తీపి పానీయాలను తీసుకోకూడదు

షుగర్ పేషెంట్లు తీపి పానీయాలను తాగకపోవడమే మంచిది. అయితే చాలా మంది పండుగల సమయంలో ఉపవాసం ఉండి.. తీపి పానీయాలనే ముందు తాగుతుంటారు. కానీ ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.  పండుగ రోజైనా సరే.. తప్పని సరిగా రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవాలి. ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మెడిసిన్స్ ను యూజ్ చేయాలి. ఆరోగ్యంగా ఉండటానికి మంచి పోషకాహారం తప్పని సరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉండే వాటినే తినాలి. 
 

Read more Photos on
click me!

Recommended Stories