జీర్ణవ్యవస్థను దృఢంగా ఉంచుతుంది.. ప్రతిరోజూ ఉదయాన్నే మూడు నుంచి నాలుగు కరివేపాకు ఆకులను నమలడం వల్ల ఉబ్బరం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి బయటపడతారు. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటేనే అనేక వ్యాధులు వాటంతట అవే నయమవుతాయి. అంటే జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయని అర్థం.