ఇడ్లీ పిండి మరీ గట్టిగా ఉన్నా, లేదా పాతబడినా దోశలు మెత్తగా వస్తాయి. అలాంటప్పుడు, పిండిలో ఒక చెంచా బియ్యం పిండి కలిపితే దోశలు కరకరలాడేలా వస్తాయి. ఇది దోశలకు మంచి క్రిస్పీనెస్ ఇస్తుంది. మరో ఆప్షన్గా, కొద్దిగా నానబెట్టిన రవ్వను రుబ్బి పిండిలో కలపవచ్చు.
దోశె వేయడానికి ముందు చిన్న టెస్ట్ చేయండి. స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక, కొద్దిగా పిండి వేసి టెస్ట్ చేయండి. పిండి పెనంపై ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి. పిండి మరీ గట్టిగా ఉంటే దోశ దళసరిగా వస్తుంది. మరీ పల్చగా ఉంటే పెనంపై స్ప్రెడ్ చేయడం కష్టమవుతుంది. అందుకే పిండి జారుగా ఉండాలి కానీ, నీళ్లలా ఉండకూడదు. ఇలా మిగిలిన ఇడ్లీ పిండిని వేస్ట్ చేయకుండా, అదే పిండితో బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీ, క్రిస్పీ దోశలు రెడీ చేసుకోవచ్చు.