సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు కనీసం1000 మిల్లీగ్రాముల కాల్షియాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటాయి.
అయితే వయసు మీద పడుతున్న కొద్దీ ఎముకల బలం తగ్గుతూ వస్తుంది. దీనివల్ల నడవక పోవడం, ఎక్కువ సేపు నిలబడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఎముకలను బలంగా ఉంచేందుకు, ఎముకలకు సంబంధించిన రోగాల నుంచి ఉపశమనం కలిగించేందుకు కాల్షియం ఎంతో సహాయపడుతుంది. మరి ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి? వేటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..