నిజానికి పండ్లు కోసినప్పుడు గోధుమ రంగులోకి మారడానికి కారణం ఆక్సీకరణ చెందడమే. ఆపిల్, పియర్, జామ వంటి పండ్లు కోసిన తరువాత కొన్ని గంటల్లో గోధుమ రంగులోకి మారుతాయి. దీనికి కారణం ముందు చెప్పుకున్నట్టుగా ఆక్సీకరణ చెందడమే. పండ్ల ఆక్సీకరణ రెండు ప్రధాన కారణాల వల్ల జరుగుతుంది. ముందుగా, పండ్లు గాలికి ఎక్స్ పోజ్ అవ్వడం వల్ల... గాలిలోని తేమ రుచి, ఆకృతిలో మార్పును కలిగిస్తుంది. రెండవది, యాపిల్స్ వంటి పండ్లను కోసినప్పుడు తక్షణమే ఎంజైమ్లు విడుదల అవుతాయి. దీనివల్ల వాటిని గాలికి పెట్టినప్పుడు లేదా ముక్కలుగా కోసి ఎక్కువ గంటలు ప్యాక్ చేసినప్పుడు, ఎంజైమాటిక్ ప్రతిచర్యలు ఆపిల్స్ నల్లబడటానికి కారణమవుతాయి.