ముఖంపై నల్లని మచ్చలు పోవాలంటే ఇలా చేయండి..

First Published Dec 2, 2022, 3:53 PM IST

కొంతమందికి మొటిమలు పూర్తిగా తగ్గిపోయనప్పటికీ.. మొటిమల మచ్చలు మాత్రం అస్సలు పోవు. అయితే ఈ మచ్చలు తగ్గడానికి కాస్త సమయం పడుతుంది. మొటిమలను గిచ్చినా.. అవి పగిలిపోయినా.. మచ్చలు ఇంకా ఎక్కువ అవుతాయి. 
 

ముఖం మీద నల్లటి మచ్చలు అందాన్నంతా తగ్గిస్తాయి. ఈ మచ్చలు ఎక్కువగా మొటిమల వల్లే ఏర్పడతాయి. అయితే ఈ మొటిమలు తగ్గినా.. మొటిమల మచ్చలు మాత్రం అలాగే ఉంటాయి. ఈ మచ్చలు మొటిమలను గిచ్చడం వల్ల, అవి పగిలిపోవడం వల్ల ఏర్పడతాయి. ఈ మచ్చలు అంత తొందరగా తగ్గవు. అయితే కొన్ని చిట్కాలతో ఈ నల్లని మచ్చలను పూర్తిగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆరెంజ్ తొక్క 

ముందుగా ఒక టీస్పూన్ ఆరెంజ్ తొక్క పొడిని తీసుకోండి. ఇందులో రెండు టీ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికంతా అప్లై చేయండి. ఒక 20 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రంగా కడగండి. ఈ మిశ్రమం మీ ముఖంపై ముడతలు తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే నల్లని మచ్చలను వదిలిస్తుంది. 
 

బొప్పాయి

బొప్పాయిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. బొప్పాయి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కు భాండాగారం. బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ, పెపైన్ ఎంజైమ్ లు ముఖం మీద ఉండే మృతకణాలను తొలగించడానికి సహాయపడతాయి. బొప్పాయి ముఖంపై ఉండే నల్లటి మచ్చలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఇది మీ ముఖాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. ఇందుకోసం ముందుగా బాగా పండిన బొప్పాయి ముక్కను తీసుకుని సన్నగా తరగండి. దీనిలో ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలగలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి.

కలబంద

కలబంద చర్మ సంరక్షణకు ఉత్తమమైన వాటిలో ఒకటి. కలబంద ఎన్నో రకాల చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ముఖానికి అలోవెరా ను పెట్టడం వల్ల నల్లటి మచ్చలను తొలగిపోతాయి. కలబంద జెల్ ను మొటిమలను, దాని మచ్చలకు పోగొట్టడానికి ఉపయోగిస్తారు. కలబంద గుజ్జును ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.
 

శెనగపిండి

ఒక టీస్పూన్ శనగపిండిని తీసుకుని అందులో అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మొటిమలు, వాటి మచ్చలు తొలగిపోతాయి.

తేనె, శెనగ పిండి

ఒక టీస్పూన్ తేనె తీసుకుని అందులో ఒక టీస్పూన్ శెనగ పిండిని వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి బాగా అప్లై చేయవచ్చు. 20 నిమిషాల తర్వాత నీట్ గా కడిగేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ముఖంపై ఉండే నల్లని మచ్చలు తొందరగా తొలగిపోతాయి.

click me!