రోజంతా ఏసీ గదిలో ఉండటం హాయిగా అనిపిస్తుంది, సౌకర్యంగా ఉంటుంది. కానీ ఎక్కువసేపు ఏసీలో ఉంటే చర్మం పొడిబారడం, కళ్లలో మంట, ముక్కు-గొంతు పొడిబారడం వంటి సమస్యలు రావచ్చు.
ఎక్కువసేపు ఏసీ గదిలో ఉంటే, గదిలోని తేమ తగ్గి చర్మం పొడిబారుతుంది. పెదాలు పగలడం, దురద వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో కళ్ల మంట, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆస్తమా లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి చల్లని, పొడి గాలి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల శ్వాస సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఊపిరితిత్తుల వైద్యులు చెబుతున్నారు.