ఇకపోతే జామ్ నగర్ లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకకు వచ్చిన అతిథుల కోసం అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన మర్యాదలు తెలిస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు. అవును ఈ ఈవెంట్ కు వచ్చిన అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన, ప్రత్యేకమైన సేవలను ఏర్పాటు చేసింది. వీటిలో ముంబై, ఢిల్లీ నుంచి జామ్ నగర్ కు చార్టర్డ్ విమానాలు, ప్రపంచ స్థాయి చెఫ్ లు, వార్డ్ రోబ్ సేవలు, అతిథుల కోసం విలాసవంతమైన కార్లు, రిహానా, అరిజిత్ సింగ్, దిల్జిత్ దోసాంజ్, అజయ్-అతుల్ తో సహా అనేక మంది ప్రసిద్ధ కళాకారుల సంగీత ప్రదర్శనలంటూ ఎన్నో ఉన్నాయి. అంబానీ ఫ్యామిలీ వేడుక అంటే ఈ మాత్రం ఉంటుంది మరీ అని లోకానికి తెలియజేశారు.