చాణక్యుడు చెప్పిన విషయాన్ని చాలా మంది వైద్యులు కూడా అంగీకరించారు. నిపుణుల ప్రకారం.. మధ్యాహ్నం పూట 20 నుంచి 30 నిమిషాలపాటు కాసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది. కానీ పగటి పూట 2 నుంచి 3 గంటల పాటు నిద్రపోవడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మధ్యాహ్న నిద్ర కారణంగా చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని చాలా అధ్యాయనాలు చెబుతున్నాయి.
మానసిక ప్రభావం, ప్రతికూల శక్తి...
మధ్యాహ్నం నిద్రించే అలవాటు కేవలం శరీరంపైనే కాకుండా, మనసుపై కూడా ప్రభావం చూపుతుంది. మధ్యాహ్నం నిద్రపోయి లేచిన తర్వాత.. అలసట ఎక్కువగా ఉంటుందని చాలా మంది చెబుతూ ఉంటారు. అంతేకాదు.. తర్వాత ఏ పనీ సరిగా చేయలేరు కూడా. అంతేకాదు.. మధ్యాహ్నం ఎక్కువగా నిద్రపోవడం వల్ల రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. దీని వల్ల మొత్తం స్లీప్ సైకిల్ పాడైపోతుంది.
చాణక్యుని దృష్టిలో, మధ్యాహ్నం నిద్రించడం ఒక అశుభ సూచకం. అయితే, నేటి శాస్త్రం ప్రకారం, మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవడం హానికరం కాదు. కాబట్టి, మధ్యాహ్న నిద్రను పూర్తిగా మానుకోవడానికి బదులుగా, దానిని ఒక నిర్దిష్ట సమయానికి పరిమితం చేసుకొని తీసుకోవడం శ్రేయస్కరం. నిద్ర, పని , క్రమశిక్షణ.. ఈ మూడింటి మధ్య సమతుల్యత పాటించడమే ఆరోగ్యం, విజయాలకు నిజమైన మార్గం.