ముఖ్యంగా ఈ సీజన్లో రుతు పవనాల కారణంగా భారీ కురిసి వరదలు ముంచెత్తే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉన్నట్టుండి వరద పోటెత్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సహా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల హైవేల పైనుంచి రాకపోకలు సాగించడం కష్టతరంగా మారింది.