2026 మార్చి 31లోగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఉంది. కరవు భత్యం (DA) 3% నుంచి 4% వరకు పెరగొచ్చని అంచనా. దీంతో పాటు మూడు నెలల బకాయిలు కూడా అందనున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియకముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనుంది. అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక (AICPI-IW) తాజా గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి రావలసిన కరవు భత్యం (DA) పెంపు ప్రకటన దాదాపు ఖరారైంది. మోదీ ప్రభుత్వం ఈ ప్రకటనను మార్చి చివరి వారంలో చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం మార్చి 31వ తేదీలోగా అమల్లోకి వస్తుంది. మోదీ ప్రభుత్వం ఈ ప్రకటనను మార్చి చివరి వారంలో చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం మార్చి 31వ తేదీలోగా అమల్లోకి వస్తుంది.
27
కరవు భత్యం 3 నుండి 4 శాతం...
లేబర్ బ్యూరో విడుదల చేసిన డిసెంబర్ 2025 వరకు ఉన్న ఏఐసీపీఐ (AICPI) సూచిక డేటాను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈసారి కరవు భత్యం 3% నుంచి 4% వరకు పెరగవచ్చని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 58% డీఏ అందుకుంటున్నారు.
37
62 శాాతానికి చేరుకోనున్న డీఏ..
ఒకవేళ డీఏ 4% పెరిగితే,మొత్తం డీఏ 62 శాతానికి చేరుకుంటుంది. అయితే, మరో అంచనా ప్రకారం, డిసెంబర్ నెల సూచిక 148.2 పాయింట్లుగా లెక్కిస్తే డీఏ 60 శాతానికి చేరే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత రేటు కంటే 2 శాతం ఎక్కువ.
గతంలో జరిగిన ప్రకటనలను పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వం సాధారణంగా మార్చి చివరిలోనే డీఏ పెంపును ప్రకటిస్తుంది. గతేడాది అంటే 2025లో మార్చి 28న, 2023లో మార్చి 24న ఈ ప్రకటన వెలువడింది.
ఇదే ట్రెండ్ కొనసాగితే మార్చి 20 నుంచి 31 మధ్య జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించవచ్చు. దీనివల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందుతారు.
57
2026 కరవు భత్యం అమలు..
ఈ కరవు భత్యం పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి ప్రకటన మార్చిలో వచ్చినా, ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి, మార్చి.. ఈ మూడు నెలల బకాయిలు (Arrears) ఒకేసారి అందుతాయి.
67
8వ పే కమీషన్ పై దృష్టి
ఉదాహరణకు, ఒక ఉద్యోగి మూల వేతనం (Basic Salary) రూ.18000 అయితే, 3% డీఏ పెంపుతో నెల జీతం సుమారు రూ.540 పెరుగుతుంది. దీనితో పాటు మూడు నెలల బకాయిలు కూడా వస్తాయి. పెన్షనర్లకు కూడా డియర్నెస్ రిలీఫ్ (DR) ఇదే విధంగా పెరుగుతుంది.
డీఏ పెంపుతో పాటు ఉద్యోగుల దృష్టి 8వ పే కమిషన్పై కూడా ఉంది. 7వ పే కమిషన్ పదవీకాలం 2025 డిసెంబర్ 31తో ముగిసింది. 8వ పే కమిషన్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ, దాని సిఫార్సులు అమల్లోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.
77
శాలరీ కూడా పెరుగుతుందా..?
ఈ మధ్యకాలంలో డీఏ పెంచి, దాన్ని మూల వేతనంలో కలపాలన్న డిమాండ్ ఉద్యోగుల్లో బలపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, మార్చిలో రాబోయే ఈ జీతాల పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు.