పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు

Published : Nov 11, 2025, 03:29 PM ISTUpdated : Nov 11, 2025, 03:46 PM IST

Islamabad Court Blast: ఇస్లామాబాద్ కోర్టు సమీపంలో భారీ  పేలుడు సంభవించి 12 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు దీన్ని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు.

PREV
14
ఇస్లామాబాద్ లో భారీ పేలుడు

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు చోటుచేసుకుంది. స్థానిక మీడియా ప్రకారం, ఈ దాడిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. బాధితులలో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టు సిబ్బందే ఉన్నారని పోలీసులు తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కోర్టు సముదాయంలో పార్క్ చేసిన వాహనంలో అమర్చిన గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. అయితే, పోలీసులు దీన్ని ఆత్మాహుతి దాడిగా కూడా పరిశీలిస్తున్నారు.

పేలుడు ఎలా జరిగింది?

మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ప్రవేశ ద్వారం వద్ద ఈ పేలుడు జరిగింది. ఆ సమయంలో కోర్టు పరిసరాల్లో న్యాయవాదులు, సిబ్బంది పెద్ద ఎత్తున ఉన్నారు. ఆకస్మికంగా చోటుచేసుకున్న భారీ శబ్ధంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

సాక్షులు ఈ పేలుడు పై మాట్లాడుతూ.. "నేను నా కారును పార్క్ చేసి కోర్టు లోనికి అడుగుపెట్టగానే గేటు దగ్గర పెద్ద శబ్ధం వినిపించింది. బయటికి పరుగెత్తి చూసేసరికి రెండు మృతదేహాలు నేలపై కనిపించాయి. పలు కార్లు మంటల్లో కాలి పోతున్నాయి" అని చెప్పారు.

పేలుడు శబ్ధం సుమారు ఆరు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. వీడియోల్లో కాలిపోయిన వాహనం నుండి పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కన్పించాయి.

24
భారీ భద్రతా ఉన్నప్పటికీ దాడి జరిగింది

ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతం సాధారణంగా అత్యంత భద్రతా నియంత్రణలో ఉంటుంది. నగరంలో ప్రవేశించడానికి అనేక చెక్‌పోస్టులు ఉండగా, ఈ పేలుడు నగరంలోని జ్యుడీషియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లాట్‌లో జరిగింది. అక్కడే అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి. ఒక భద్రతా అధికారి సీఎన్ఎన్ తో మాట్లాడుతూ.. "దాడి ఆత్మాహుతి దాడి కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి కోర్టు లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా, విఫలమయ్యాక పోలీసు వాహనం సమీపంలో పేల్చుకున్నాడు" అని అన్నారు.

ఉగ్రవాద దాడుల నేపథ్యంలో మరో ఘటన

ఈ ఘటనకు కొన్ని గంటల ముందే పాకిస్తాన్ భద్రతా దళాలు దక్షిణ వజిరిస్తాన్‌లోని కేడెట్ కాలేజ్ వానా వద్ద టిటిపి (Tehreek-e-Taliban Pakistan) దాడిని అడ్డుకున్నాయి. ఆ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో టిటిపి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడులు పెరిగి భద్రతా సిబ్బంది, ప్రభుత్వ మౌలిక వసతులపై దాడులు జరుగుతున్నాయి. దక్షిణ ఆసియా టెర్రరిజం పోర్టల్ (SATP) ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు పాకిస్తాన్‌లో ఉగ్రదాడులలో 916 మంది ప్రాణాలు కోల్పోయారు.

34
హింసాత్మక దాడులు పెరుగుతున్న నేపథ్యం

ఇస్లామాబాద్‌లో ఈ పేలుడు దేశంలో పెరుగుతున్న హింసాత్మక వరుస దాడులలో మరో ఘోర ఘటనగా నిలిచింది. ఇస్లామాబాద్‌లో ఉన్న Centre for Research and Security Studies (CRSS) నివేదిక ప్రకారం, 2025 మూడో త్రైమాసికంలో పాకిస్తాన్‌లో హింస 46 శాతం పెరిగింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం అత్యధికంగా దెబ్బతింది. 

మొత్తం హింసాత్మక మరణాల్లో 71 శాతం (638 మరణాలు) ఈ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. బలూచిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం మరణాల్లో 25 శాతం (230 కేసులు) అక్కడే నమోదయ్యాయి. ఈ గణాంకాలు పాకిస్తాన్‌లో ఉగ్రవాదం మళ్లీ తీవ్ర రూపం దాల్చిందని సూచిస్తున్నాయి.

44
ఢిల్లీలో భారీ పేలుడు

ఇస్లామాబాద్ పేలుడుకు ముందు రోజు  ఢిల్లీలో కూడా రెడ్ ఫోర్ట్ సమీపంలో ఓ కారు పేలుడు సంభవించి 10 మంది మరణించారు. ఈ దాడికి ముందు భారత నిఘా వర్గాలు జైష్-ఏ-మహమ్మద్, అంసర్ ఘజ్వతుల్ హింద్‌కి చెందిన ఉగ్రవాద మాడ్యూల్‌ను గుర్తించారు.

ఈ రెండు దేశాల్లో ఒకే సమయంలో జరిగిన దాడులు ప్రాంతీయ భద్రతా పరిస్థితులను మరింత సవాలు చేస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉండగా, టిటిపి దాడులు ఈ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories