ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మొదలు పెట్టిన దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇరాన్ సైతం ప్రతిదాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణ రోజురోజుకూ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. పరస్పర క్షిపణి దాడులతో పశ్చిమాసియా మొత్తం ఉలిక్కిపడుతోంది. ఇటీవలి దాడుల్లో ఇరాన్ కీలక నాయకులను కోల్పోగా, ప్రతిగా టెహ్రాన్ కూడా ఇజ్రాయెల్ పౌర ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది.
ఈ నేపథ్యంలో, ఇరాన్లోని మొస్సాద్ డ్రోన్ ఫ్యాక్టరీపై ఇరాన్ దాడి చేయడం కలకలం రేపింది. పేలుడు పదార్థాలు, డ్రోన్ల భాగాలు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా, మొస్సాద్కు చెందిన ఏజెంట్ను ఉరితీశారు.
25
ట్రంప్ కఠిన హెచ్చరికలు
ఈ ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. టెహ్రాన్ తన వైఖరిని మార్చకపోతే పరిస్థితి మరింత దారుణమవుతుందని హెచ్చరించారు. ‘‘ఇరాన్ ఈ యుద్ధాన్ని గెలవలదు. వారు చర్చలకు రావాలి. వాళ్లు అణ్వాయుధాలను మర్చిపోవాలి’’ అంటూ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. అణు ఒప్పందంపై సంతకం చేయాలనే సందేశాన్ని అరబ్ దేశాల ద్వారా కూడా పంపినట్లు తెలుస్తోంది.
35
జీ7 సదస్సును మధ్యలోనే వచ్చేసిన ట్రంప్
కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సులో పాల్గొన్న ట్రంప్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను అర్ధాంతరంగా ముగించారు. “ఇది అత్యవసరం” అంటూ G7 గ్రూప్ ఫొటో తరువాత వెంటనే తిరిగి అమెరికాకు బయల్దేరారు. ట్రంప్ నిర్ణయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సమర్థించారు. పశ్చిమాసియాలో శాంతి అవసరం ఉందని జీ7 నేతలు పునరుద్ఘాటించారు.
వాషింగ్టన్ చేరిన వెంటనే ట్రంప్ భద్రతా సలహాదారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ భద్రతా మండలిని ‘సిట్యుయేషన్ రూమ్’లో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇది చూస్తే, అమెరికా ముందుగానే సైనిక చర్యలకు సన్నద్ధమవుతున్న సంకేతాలుగా భావించవచ్చు. ఇప్పటికే ట్రంప్ టెహ్రాన్ ప్రజలను ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించడమే ఇందుకు సాక్ష్యంగా చెబుతున్నారు.
55
మిడిల్ ఈస్ట్లో మంటలు – గల్ఫ్ దేశాల ఆందోళన
సౌదీ, ఖతార్, ఒమన్ దేశాలు అమెరికాను ఇజ్రాయెల్పై ఒత్తిడి పెట్టాలని కోరినట్లు సమాచారం. చమురు నిల్వలు, సరఫరాలపై భయాలున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగకపోతే మిడిల్ఈస్ట్ ఆర్థిక, సాంకేతిక వ్యూహాలకు భారీ దెబ్బ తగలే అవకాశముంది. గల్ఫ్ దేశాల ఈ ఆందోళనలు మిడిల్ ఈస్ట్ పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తున్నాయి.
ఈ పరిణామాలన్నింటినీ చూస్తే, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగకుండా కొనసాగితే, తద్వారా అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే అవకాశాలు మరింత పెరిగేలా ఉన్నాయి. దీనికి ప్రపంచమంతా తీవ్రంగా స్పందించే సమయం దగ్గరపడినట్లే కనిపిస్తోంది.