Sunita Williams: సునీత విలియమ్స్‌ను భూమిపైకి ఎలా తీసుకొస్తారు? అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్‌లోకి ఎలా వస్తారు?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్‌ని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. సునీతతో పాటు మరో వ్యోమగామి బచ్  విల్‌మోర్ త్వరలోనే తిరిగి భూమ్మీద అడుగుపెట్టనున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఇంతకీ సునీత విలియమ్స్‌ను భూమిపైకి ఎలా తీసుకురానున్నారు.? పూర్తి ప్రక్రియ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Sunita Williams

నాసా-స్పేస్ఎక్స్ చేపట్టిన ‘క్రూ-10’ మిషన్‌లో భాగంగా భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున 4.33 గంటలకు కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి ఎగిరింది. రాకెట్‌కు అమర్చిన అంతరిక్ష నౌక ISSలోని ఎయిర్‌లాక్‌కు అనుసంధానం చేస్తారు. ఒకసారి ఎయిర్‌లాక్‌లో డాక్ అయితే లోపల ఉన్న వాతావరణం బయటకు రాదు. దీని తర్వాత అన్ని భద్రతా తనిఖీలను పూర్తి చేసిన తర్వాత, వ్యోమగాముల కోసం అంతరిక్ష నౌక తలుపులు తెరుచుకుంటాయి. 
 

NASA astronauts Sunita Williams and Barry Wilmore on board the ISS. (Photo credit@Space_Station)

ఈ సమయంలో వ్యోమగాములు తమ స్పేస్‌ సూటల్‌ను ధరించి అంతరిక్ష నౌక లోపలికి వెళ్తారు. డాక్ చేసిన అంతరిక్ష నౌకను ISS నుండి వేరు చేసి, థ్రస్టర్‌లు (చిన్న జెట్ ఇంజన్లు) ఉపయోగించి నియంత్రించి, దాని నిర్దేశిత గమ్యంలోకి ప్రవేశపెడతారు. ఇలా వ్యోమగాములు భూమిపై నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన అంతరిక్ష నౌకలోకి ప్రవేశిస్తారు. ఇక్కడి నుంచి వ్యోమగాములు తిరిగి భూమిపైకి చేరుకునే ప్రక్రియ మొదలవుతుంది. 
 


Sunita Williams

అంతరిక్ష నౌక భూమికి ఎలా తిరిగి వస్తుంది?

అంతరిక్ష నౌక భూమికి తిరిగి రావడానికి సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఇందుకోసం అంతరిక్ష నౌకను సరైన పథంలోకి తీసుకువచ్చి నెమ్మదిగా భూమి వాతావరణంలోకి తీసుకువస్తారు. వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఉత్పన్నమయ్యే వేడి, మంటల నుండి అంతరిక్ష నౌకను, ప్రయాణీకులను రక్షించడానికి అంతరిక్ష నౌక ముందు భాగంలో అధిక నాణ్యత గల ఉష్ణ కవచాలను అమర్చుతారు. ఇవి అగ్నిమాపక యంత్రాలతో పాటు లోపల ఉన్న పరికరాలను, ప్రయాణీకులను చల్లగా ఉంచుతాయి, తీవ్రమైన వేడి నుండి వారిని రక్షిస్తాయి. 
 

Sunita Williams

ప్రయాణీకులను నేలపైకి వచ్చిన వెంటనే ఏం చేస్తారు.? 

అంతరిక్ష నౌక సరైన ఎత్తు, వేగాన్ని చేరుకున్నప్పుడు, అంతరిక్ష నౌకకు అటాచ్‌ చేసిన పారాచూట్ తెరుచుకుంటుంది. ఈ పారాచూట్లు అంతరిక్ష నౌకను సేఫ్‌ ల్యాండింగ్‌కు సహాయపడుతాయి. ప్రయాణీకులను తిరిగి తీసుకువచ్చే అంతరిక్ష నౌకలు ఎక్కువ శాతం నీటిలో ల్యాండ్‌ అవుతాయి. ఇందుకోసం మహా సముద్రాలను ఎంచుకుంటారు. సముద్రంలో ల్యాండ్‌ కాగానే రికవరీ బృందం వారి వద్దకు వస్తుంది. రికవరీ బృందం వారిని వైద్య కేంద్రానికి తీసుకెళుతుంది, అక్కడ వారి ఆరోగ్య పరిస్థితులను చెక్‌ చేస్తారు. అనంతరం వారిని విడిగా ఉన్న ప్రత్యేక గదిలో ఉంచుతారు. కొన్ని వారాల తర్వాత వారిని భూమి గురుత్వాకర్షణ శక్తికి తిరిగి అలవాటు చేసి, ఆ తర్వాత బయటకు పంపిస్తారు. 
 

Latest Videos

click me!