అప్రమత్తమై పాక్ ప్రభుత్వం:
ట్రైన్ హైజాక్ జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే స్పందించిన పాకిస్థాన్ ప్రభుత్వం హైజాక్ జరిగిన చోటుకి భద్రతా బలగాలను పంపించి, ప్రయాణికులను రక్షించే ఆపరేషన్ను ప్రారంభించింది. ఈ క్రమంలో వేర్పాటు వాదులపై కాల్పులు జరిపి 104 మందిని రక్షించామని భద్రతా వర్గాలు వెల్లడించాయి. రక్షించిన వారిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపాయి. వీరందరినీ మరో రైలులో కాచీలోని మాచ్కి తరలించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 16 మంది మిలిటెంట్లను భద్రతా దళాలు హతమార్చినట్లు తెలుస్తోంది.