ఇదిలా ఉంటే బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక మారిన ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* ఏసీ స్లీపర్ (బెర్త్) హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రస్తుత టికెట్ ధర రూ. 1569గా ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ. 1412గా ఉంది.
* ఇక ఏసీ స్లీపర్ - సీటర్ టికెట్ ధర రూ.1203 ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ. 1083కి తగ్గింది.
* రాజధాని బస్సు విషయానికొస్తే ఇంతకు ముందు రూ. 1203గా ఉండగా ప్రస్తుతం డిస్కౌంట్ తర్వాత రూ. 1083కి తగ్గింది.
* నాన్ ఏసీ స్లీపర్ - సీటర్ టికెట్ ధర రూ.1160 ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ. 1044కి తగ్గింది.
* నాన్ ఏసీ సీటర్ విషయానికొస్తే ఇంతకు ముందు రూ. 951గా ఉండగా, డిస్కౌంట్ తర్వాత రూ. 856కి తగ్గింది.
* అలాగే సూపర్ లగ్జరీ టికెట్ ఇంతకు ముందు రూ. 946గా ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ. 851కి తగ్గింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.