నీళ్లను మరిగించి తాగడం ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల నీళ్లలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, హానికారక సూక్ష్మజీవులు చనిపోతాయి. నిజానికి ఆరోగ్యాన్ని దెబ్బతీసే బ్యాక్టీరియా నీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అయితే నీళ్లను మరిగించడం వల్ల ఇవి సహజంగా తొలగిపోతాయి. ఈ పద్దతి నీటిని సహజంగా, సురక్షితంగా ఉంచుతుంది. ఈ వాటర్ ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.