కొంతమంది తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రం బయట తిరగడం, స్మోకింగ్ చేయడం, స్నానం చేయడం లాంటి పనులను చేస్తుంటారు. కానీ తిన్న తర్వాత మీరు చేసే కొన్ని పనుల వల్ల మీరు అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత మీరు నివారించాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఎందుకంటే ఇది మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. అలాగే జీవక్రియను ప్రభావితం చేస్తుంది.దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.