తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Sep 15, 2024, 12:45 PM IST

ఖర్జూరాల్లో నేచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎన్నో తీపి వంకాలను తయారుచేయడానికి కూడా చాలా మంది ఉపయోగిస్తారు. కొంతమంది అలాగే తింటుంటారు. అయితే ఈ ఖర్జూరాలను మీరు అలాగే కాకుండా తేనెలో నానబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. 

తేనె మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే  ఖర్జూరాల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

అయితే ఈ రెండింటిని మనం కలిపి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మెరుగైన జీర్ణక్రియ 

ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడం నుంచి జీర్ణ సమస్యలను తగ్గించడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.

అయితే ఎవరికైతే జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుందో.. వారికి ఈ కాంబినేషన్ ప్రయోజనకరంగా ఉంటుంది. అవును ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే జీర్ణశక్తిని మెరుగుపడుతుంది. 

మలబద్ధకం

చెప్పుకోరు కానీ చాలా మంది మలబద్దకం సమస్య ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల అర్షమొలల నుంచి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్య ఉన్నవారు తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే ప్రయోజనకరంగా ఉంటుంది.

నిజానికి ఫైబర్ లోపం వల్లే మలబద్దకం సమస్య వస్తుంది. కాబట్టి దీన్ని తింటే ఫైబర్ లోపం తగ్గుతుంది. అలాగే మీ జీవక్రియ కూడా పెరుగుతుంది. తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే తింటే  మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

Latest Videos


బలమైన రోగనిరోధక 

కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ చాలా బలహీనంగా ఉంటుంది. ఇలాంటి వారు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే దగ్గు, జలుబు, జ్వరంతో పాటుగా ఎన్నో సమస్యలు తరచుగా వస్తూనే ఉంటాయి.

అయితే మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె, ఖర్జూరాలు బాగా సహాయపడతాయి. ఈ రెండింటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటిలో ఐరన్ తో పాటుగా జింక్, రకరకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. 

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం

కొంతమందికి సీజన్లతో సంబంధం లేకుండా దగ్గు, జలుబు సమస్యలు వస్తుంటాయి. కానీ ఈ సమస్యలు అంత తొందరగా తగ్గవు. ఇలాంటి వారికి తేనె, ఖర్జూరాలు ఎంతగానో సహాయపడతాయి.

తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే జలుబు,  దగ్గు తొందరగా తగ్గిపోతాయిని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం మారినప్పుడు తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను  ఖచ్చితంగా తినండి. దగ్గు, జలుబు రావు. 
 

కండరాల పెరుగుదల

కండరాలు పెంచాలనుకునే వారికి తేనె, ఖర్జూరాలు బాగా సహాయపడతాయి. అవును తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను రోజూ తింటే కండరాలు వేగంగా పెరుగుతాయి.

తేనెలో, ఖర్జూరాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ కాంబినేషన్ మీరు కండరాలను పెంచడానికి బాగా సహాయపడుతుంది.
 


చర్మానికి మేలు 

తేనె, ఖర్జూరాలు రెండూ మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంటే ఇది మన చర్మాన్ని లోపలి నుంచి మృదువుగా, అందంగా చేస్తుంది. ఖర్జూరాలను తింటే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

వాపును తగ్గిస్తుంది

తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మీరు తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే శరీరంలో వాపు తగ్గుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

click me!