మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్నానాన్ని ఖచ్చితంగా చేయాలి. అయితే చాలా మంది బాత్రూంకు వెళ్లామా, త్వర త్వరగా శరీరానికి సబ్బు పూసామా, నీరు పోసామా, టవల్ తో తుడుచుకున్నామా అన్నట్టే ఉంటారు. కేవలం ఐదే నిమిషాల్లో స్నానాన్ని కంప్లీట్ చేస్తారు. ఇలా స్నానం చేయడం వల్ల మీ శరీరానికి అంటుకున్న మురికి పోనేపోదు. స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందలేరంటున్నారు నిపుణులు. అవును శరీరంపై మురికి పోకుంటే ఎన్నో వ్యాధులు వస్తాయి. అందుకే స్నానాన్ని సరైన పద్దతిలోనే చేయాలంటున్నారు నిపుణులు. ఇక రెండోది స్నానం చేసిన తర్వాత శరీరంతో పాటుగా మనసు కూడా ఫ్రెష్ గా మారుతుంది. ఆయుర్వేదంలో తినడానికి, నిద్రలేవడానికి, సరైన సమయంలో యోగా చేయడానికి నియమాలు ఉన్నట్లే.. స్నానానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..