కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేయించుకోకుంటే..?

First Published Apr 27, 2021, 3:04 PM IST

ప్రభుత్వాలు సైతం కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ డ్రైవ్ లను నిర్వహిస్తోంది. ఈ వైరస్ భయంతో చాలా మంది వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. మొదటి డోస్ తీసుకున్న సరిగ్గా నెల రోజులకు సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.

కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. ఊహించని రీతిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ కనీసం మూడు లక్షల కరోనా కేసులు నమోదౌతూనే ఉన్నాయి. ఎంత మాస్క్ లు ధరించినా.. హ్యాండ్ వాష్ చేస్తూ.. శానిటైజర్లురాసుకుంటున్నా కూడా.. కరోనా వస్తూనే ఉంది. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే... వ్యాక్సిన్ ఒక్కటేనని నిపుణులు చెబుతున్నారు.
undefined
ప్రభుత్వాలు సైతం కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ డ్రైవ్ లను నిర్వహిస్తోంది. ఈ వైరస్ భయంతో చాలా మంది వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. మొదటి డోస్ తీసుకున్న సరిగ్గా నెల రోజులకు సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.
undefined
అయితే... మొదటి డోస్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ మిస్ అయితే పరిస్థితి ఏంటి..? ఇదే అనుమానం చాలా మందిలో ఉంది. ఒకటి మనం మర్చిపోవడం.. రెండోది.. వ్యాక్సిన్ స్టాక్ అయిపోవడం. ఈ రెండింటిలో ఏది జరిగినా మనకు ఇబ్బందే.
undefined
అమెరికాలో సెకండ్ డోస్ కి వ్యాక్సిన్ అందుబాటులో లేదని.. దీంతో మొదటి డోస్ తీసుకున్నవారంతా కంగారు పడుతున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఇదే భయం భారత్ లోనూ కొందరిలో మొదలైంది.
undefined
ప్రస్తుతం మన దేశంలో రెండు డోస్ లకు సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని.. కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించింది.
undefined
కోవ్యాగ్జిన్ సెకండ్ డోస్ అయితే మొదటి డోస్ తీసకున్న 28వ రోజు తీసుకోవాలని.. అదే కోవీషీల్డ్ అయితే 8 వారాల తర్వాత తీసుకోవాలని చెబుతున్నారు.
undefined
కాగా.. కేవలం మొదటి డోస్ మాత్రమే తీసుకుంటే.. కరోనా నుంచి తప్పించుకోలేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రెండు డోస్ లు వ్యాక్సిన్ తీసుకుంటేనే కరోనా నుంచి బయటపడగలరని అలాకుండా.. సింగిల్ డోస్ తీసుకుంటే.. కరోనా సోకే ప్రమాదం ఉందనే అర్థమని వారు చెబుతున్నారు.
undefined
సెకండ్ డోస్ తీసుకోకుండా.. ఫస్ట్ మాత్రమే తీసుకునేవారిలో ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా.. ఈ వ్యాక్సిన్ లపై ఇఫ్పటి వరకు త్రీ ట్రయల్స్ నిర్వహించారు. వాటిల్లో 78శాతం కోవాగ్జిన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని తేలింది.
undefined
కాగా.. కోవ్యాగ్జిన్ తయారీ సంస్థ మాత్రం... రెండు డోసులు తీసుకుంటే.. 100 శాతం కరోనాపై తమ వ్యాక్సిన్ పోరాడుతుందని పేర్కొంది. కోవీషీల్డ్ తయారీ సంస్థ అదే విషయాన్ని స్పష్టం చేసింది.
undefined
click me!