చల్లనీళ్లు కాదు.. వేడి వాటర్ ను తాగారంటే ఆ సమస్యలన్నీ దూరం..

First Published Mar 21, 2024, 3:21 PM IST

ఎండాకాలంలో చాలా మంది ఫ్రిజ్ వాటర్ నే ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఈ సీజన్ లో కూడా మీరు గోరువెచ్చని నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవును వేడినీళ్లను తాగితే మలబద్దకం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలను పొందుతారు. 

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద తీసుకుంటారు. ఫిట్ గా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. హెల్తీ ఫుడ్ నుంచి ఎక్సర్ సైజుల వరకు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీదీ చేస్తున్నారు. వీటిలో వేడి వాటర్ ను తాగడం కూడా ఉంది. అవును వేడినీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేడి నీళ్లను తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఎన్నో దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గిపోతాయి. అసలు వేడి నీళ్లు తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మలబద్ధకం నుంచి ఉపశమనం

చాలా మందికి మలబద్దకం సమస్య ఉంటుంది. మలబద్దకం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అలాగే చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. మలబద్దకం సమస్యతో బాధపడేవారికి వేడి నీళ్లు ఎంతో ప్రయోజనకరంగా ుంటాయి. అవును గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల మలం మృదువుగా మారుతుంది. అలాగే మల విసర్జనకు ఎలాంటి ఆటంకం కలగదు. వేడినీళ్లు మలబద్దకం నుంచి ఉపశమనం కలగడానికి ఎంతో సహాయపడుతుంది. 

బరువు తగ్గడానికి

గోరువెచ్చని నీళ్లను తాగితే జీవక్రియ పెరుగుతుంది. దీంతో కేలరీలు బర్న్ అవుతాయి. రోజూ గోరు వెచ్చని నీటిని తాగడంతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ప్రతిరోజూ వ్యాయామం చేయండి. దీనివల్ల మీరు తొందరగా బరువు తగ్గుతారు. 

నిర్విషీకరణ

గోరు వెచ్చని నీళ్లు శరీరంలో చెమట ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే మూత్రవిసర్జనను కూడా పెంచి నిర్విషీకరణ ప్రక్రియకు సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన విషాలన్నీ బయటకు పోతాయి. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు తప్పుతుంది. 

మెరుగైన రక్త ప్రసరణ

గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రక్త నాళాలు సడలుతాయి. అలాగే శరీరంలోని వివిధ భాగాలకు కూడా ఆక్సిజన్, పోషకాల పంపిణీ కూడా బాగుంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది.
 

ఒత్తిడి నుంచి ఉపశమనం 

గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. వేడినీళ్లు తాగడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మనసు కూడా కుదుట పడుతుంది. గోరువెచ్చని నీళ్లను తాగితే స్ట్రెస్ నెమ్మదిగా తగ్గుతుంది. మీకు విశ్రాంతి కలిగిస్తుంది.
 

నొప్పి తగ్గుతుంది

గోరువెచ్చని నీళ్లను తాగితే కండరాల ఉద్రిక్తత తగ్గుతుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.  కండరాల నొప్పి, ఆర్థరైటిస్ నొప్పి, నెలసరి తిమ్మిరి, నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

click me!