పుష్కలంగా నీటిని తాగాలి
పెరుగుతున్న ఉష్ణోగ్రతలో మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం కాఫీ, ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఈ పానీయాలు నిర్జలీకరణ ప్రమాదాన్ని పెంచుతాయి. విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. శరీరం హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి డిటాక్స్ డ్రింక్స్ ను తాగండి. లస్సీ, కొబ్బరి నీరు, నిమ్మరసాలు కూడా మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అయితే ఎండాకాలంలో ఎక్కువ చల్లని పదార్థాలను తినడం, తాగడం మానుకోండి. ఎందుకంటే ఇది మీ శరీరానికి హాని కలిగిస్తుంది.