ఏప్రిల్ నెల మొదలైనప్పటి నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు చాలా దారుణంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేడి, వడగాల్పుల కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురవుతుంటారు. స్కూలుకు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే వృద్ధులు, ఎండలకు పనులకు వెళ్లే వారికే ఈ ప్రమాదం ఎక్కువ. వీరికి వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు మనం చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం పదండి.