నీటిని తక్కవగా తాగడం
కొంతమంది తిన్నప్పుడు మాత్రమే నీళ్లను తాగుతుంటారు. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. కానీ ఈ డీహైడ్రేషన్ మధుమేహాన్ని ప్రభావితం చేస్తుంది. నీళ్లను తక్కువగా తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
భోజనం స్కిప్ చేయడం / లేట్ గా తినడం
కొంతమంది పనుల్లో పడి భోజనం చేయడమే మర్చిపోతుంటారు. లేదా లేట్ గా తింటుంటారు. కానీ ఈ అలవాట్ల వల్ల మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి.