ఎలక్ట్రోలైట్లు బయటకు పోతాయి: మనం వ్యాయామం చేసేటప్పుడు నీరు మాత్రమే కాకుండా సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు కూడా చెమట ద్వారా మన శరీరం నుండి బయటకు పోతాయి. వ్యాయామం తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల మన శరీరంలోని ఎలక్ట్రోలైట్ కంటెంట్ తగ్గి నీటి శాతం ఎక్కువై పోతుంది. దీని వల్ల కండరాల నొప్పులు, తల తిరగడం, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వ్యాయామం తర్వాత వెంటనే నీరు తాగకుండా కాస్త ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే ఆహారాలు, ఎనర్జీ పానీయాలను తీసుకోవడం మంచిది.