బియ్యప్పిండి, అరటిపండు గుజ్జు: ఒక కప్పులో కొద్దిగా బియ్యప్పిండి (Rice flour), బాగా పండిన అరటిపండు గుజ్జును (Banana pulp) తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు ప్రయత్నిస్తే ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, నల్లటి మచ్చలు, వృద్ధాప్య ఛాయలు తగ్గిపోయి చర్మం మృదువుగా మారుతుంది.