ఈ చిట్కాలు పాటిస్తే ఆస్తమా రోగులు కూడా దీపావళి ఆనందంగా చేసుకోవచ్చు

First Published Oct 27, 2024, 1:42 PM IST

దీపావళిని అందరూ ఆనందంగా జరుపుకుంటారు కదా.. కాని ఆస్తమా ప్రాబ్లమ్ ఉన్న వాళ్లు మాత్రం దీపావళి రోజు చాలా భయపడుతూ ఉంటారు. దీపాలు పెట్టాలన్నా, టపాసులు పేల్చాలన్నా భయపడతారు. టపాసుల నుంచి విడుదలయ్యే హానికారక పొగ వల్ల వారి లంగ్స్ మరింత దెబ్బతింటాయి. దీంతో హెల్త్ ప్రాబ్లమ్ పెరుగుతుందని ఆందోళన చెందుతుంటారు. అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆస్తమా రోగులు కూడా దీపావళిని ఆనందంగా, ఎటువంటి భయాలు లేకుండా జరుపుకోవచ్చు. అవేంటో ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. 

దేశ వ్యాప్తంగా దీపావళిని ఆనందంగా జరుపుతారు. దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో అయిదు రోజులు పండుగలా దీపావళి చేస్తారు. ఇండియాతో పాటు నేపాల్ దేశంలోనూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అసలు దీపావళి అంటే దీపాలు వెలిగించడం. కాని ఈ సంప్రదాయం కాలానుగుణంగా మారి దీపావళి అంటే టపాసులు పేల్చడంలా మారిపోయింది. ఇది ప్రతి సంవత్సరం విపరీతంగా మారుతూ పొల్యూషన్ కి కారణమవుతోంది. బాణసంచా వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతోంది. విషపూరిత పొగ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తోంది. 

పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ నానా బాధలు పెడుతుంటాడు. ఆ బాధలు తట్టుకోలేక ప్రజలంతా  శ్రీకృష్ణుడు వేడుకుంటారు.  తమను రక్షించమని మొర పెట్టుకుంటారు. అయితే మరణం లేకుండా వరం పొందిన నరకాసురుడిని ఆయన తల్లి అయిన భూదేవి మాత్రమే చంపగలదు. ద్వాపర యుగంలో ఆమె సత్యభామగా పుట్టి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకుంటుంది. నరకాసురుని చంపే బాధ్యత తీసుకున్న శ్రీకృష్ణుడికి సత్యభామే నరకాసురిని తల్లి అని తెలుసు. అందుకే నరకాసుడితో యుద్ధానికి సత్యభామను కూడా వెంట తీసుకెళతారు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేక సొమ్మసిల్లినప్పుడు సత్య భామ బాణాలు వేసి నరకాసురుడిని అంతం చేస్తుంది. అతడి పీడ వదిలినందుకు గాను మరుసటి రోజు ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి దీపావళి చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.

Latest Videos


అయితే త్రేతాయుగంలోనూ దీపావళి పండగ జరుపుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీరాముడు రావణాసురుడిని యుద్ధంలో ఓడించి అంతం చేసిన తర్వాత ప్రజలు ఆయన విజయానికి ప్రతీకగా దీపాలు వెలిగించి దీపావళి చేసుకున్నారని కొందరు పండితులు చెబుతున్నారు. ఆ రోజు అమావాస్య కావడంతో చీకటిని తొలగించేందుకు దీపాలు వెలిగించి కాంతిని వెదజల్లి దీపావళి జరుపుకొనేవారు. ఇది కాలక్రమేణ మార్పులు చెంది దీపావళి అంటే టపాసులు, బాణసంచా కాల్చడమేనన్నట్లుగా మారిపోయింది. అసలు నరకాసురుడు అనే ఈ రాక్షసుడు  కృతయుగంలోనూ వరాహ స్వామికి, భూదేవికి జన్మించాడని పురాణాల్లో ఉంది. 

దీపావళి సమయంలో ఆస్తమా రోగులకు ఆస్తమా తీవ్రమవుతుంది. ఎందుకంటే దీపావళి బాణసంచా వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. పొగలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సీసం, రాగి, సోడియం, పొటాషియం వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశ వ్యవస్థను ఇబ్బంది పెడతాయి. అలెర్జీలకు కారణమవుతాయి. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పెరుగుతాయి. 

ఆస్తమా రోగులకు దీపావళి జాగ్రత్తలు

1. టపాసులు కాల్చినప్పుడు ఏర్పడే పొగ, రసాయనాలు శ్వాస సంబంధిత సమస్యలను పెంచుతాయి. దీన్ని నివారించడానికి వాటిని దూరంగా ఉంచడం మంచిది.

2. బయటకు వెళ్లే అవసరం ఉంటే మంచి నాణ్యమైన మాస్క్ (N95) ధరించడం ద్వారా వాయుకాలుష్యం నుండి రక్షణ పొందవచ్చు.

3. మీ శ్వాస మార్గాలను తేమగా ఉంచడానికి నీరు ఎక్కువగా తాగండి. 

4. జీర్ణ సమస్యలను కలిగించే ఆస్తమాను తీవ్రతరం చేసే కొవ్వు, మసాలా ఆహారాలను మానుకోండి.

5. స్మోకింగ్(ధూమపానం) మానుకోండి.

6. వెచ్చగా ఉండే దుస్తులు ధరించండి.

7. డాక్టర్ సూచించిన ఇన్హేలర్లు లేదా ఇతర ఆస్తమా మందులను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి.

8. AC లేదా ఫ్యాన్ల కింద నేరుగా కూర్చోవద్దు.

9. దీపావళికి ముందు, తర్వాత మీ వైద్యుడిని సంప్రదించండి.

10. దుమ్ము, పొగ ఉన్న వాతావరణాలకు దూరంగా ఉండండి.  శ్వాస సంబంధిత వ్యాయామాలు చేసే అలవాటు చేసుకోవడం ద్వారా మీరు శ్వాస పై నియంత్రణను పెంచుకోవచ్చు.

ఈ చిట్కాలను పాటిస్తే, ఆస్తమా రోగులు సురక్షితమైన, ఆనందకరమైన దీపావళిని ఆస్వాదించవచ్చు.

click me!