ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భారత్లో డయాబెటిస్ కేసులు ఎక్కువుతున్నాయి. ఓ అంచనా ప్రకారం 2022లో దేశ జనాభాలో సుమారు 23.7 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నట్లు తేలింది. 2025 చివరి నాటికి ఈ సమస్య మరింత పెరగడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక యువతలోనూ డయాబెటిస్ రాడడం ఆందోళన కలిగిస్తోంది. 25 ఏళ్లలోపు యువతలో సుమారు 25 శాతం మందికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. శారీరక శ్రమ తగ్గడం తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ రావొద్దన్నా, వచ్చిన వారిలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలన్నా కొన్ని రకాల వాటికి దూరంగా ఉండాలి.