డయాబెటిస్ ఉన్నవారికి ఏ పండ్లు మంచివి? ఏ పండ్లకు దూరంగా ఉండాలి?
డయాబెటిస్ పేషెంట్లు పండ్లను ఎక్కువగా తినొచ్చు. బొప్పాయి, జామ, ఆపిల్, నారింజ, పియర్, పుచ్చకాయ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ, చెర్రీలు, అవొకాడోలను మధుమేహులు తినొచ్చు. అయితే వీటిని ఎంత తినాలి అనేది వీటిలోని గ్లైసెమిక్ ఇండెక్స్ పై ఆధారపడి ఉంటుంది. ఒకసారి తినే దానిలో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండాలి. పండ్ల రసాలు, తయారుగా ఉన్న లేదా సంరక్షించబడిన పండ్లు, ఎండిన పండ్లను తినకపోవడమే మంచిది. అందుకే వీటిలో అదనపు చక్కెరలు ఉంటాయి. అందుకే ఇవి చాలా తీయగా ఉంటాయి.