ముడతలను, మచ్చలను తగ్గిస్తుంది: ఒక కప్పులో బంగాళదుంప గుజ్జు (Potato mash), కొద్దిగా పెరుగు (curd) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి.