గుమ్మడి గుజ్జు, పాలు, తేనె, గుడ్డు తెల్లసొన: ఒక కప్పు తీసుకొని అందులో కొద్దిగా గుమ్మడి గుజ్జు (Pumpkin pulp), పాలు (Milk), తేనె (Honey), గుడ్డు తెల్లసొన (Egg white) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు బాగా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.