ఈ కూరలను వేడి చేస్తే విషమవుతాయి.. పొరపాటున తిన్నారంటే?

First Published Oct 23, 2024, 4:42 PM IST

మనలో చాలా మందికి ఒకసారి వండిన ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తినే అలవాటు ఉంటుంది. కానీ కొన్ని ఆహారాలను మళ్లీ వేడి చేస్తే విషంలా మారుతాయి. అవేంటంటే? 

ఓవర్ కుకింగ్

మనం తినే ఆహారమే మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ మనం హెల్తీ ఫుడ్ నే తిన్నా అవి మన ఆరోగ్యాన్ని పాడు చేయొచ్చు. అది కూడా వాటిని మళ్లీ వేడి చేసి తింటే. 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం వాటిని ఎలా తింటున్నాం? ఎలా వండుతున్నాం? అనే దానిపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. తప్పుడు ఆహారపు అలవాట్లు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తాయి. వీటిలో ఆహారాలను పదే పదే వేడి చేసి తినడం ఒకటి. ఇలా తినడం వల్ల మీకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఓవర్ కుకింగ్

సాధారణంగా అప్పుడే వండిన ఆహారాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొంతమంది ఉదయం వండిన ఆహారాలను రాత్రి వరకు తింటారు. అలాగే రాత్రిపూట వాటిని మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

అలాగే వంటను ఎక్కువ సేపు చేయడం కూడా మంచిది కాదు. అంటే ఎక్కువగా ఉడికించకూడదు. ముఖ్యంగా కొన్ని ఆహారాలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలో ఉండే పోషకాలు తగ్గి మన శరీరానికి హాని చేస్తాయి. దీనివల్ల మీకు  క్యాన్సర్ కూడా రావొచ్చు. అందుకే వేటిని మళ్లీ వేడి చేసి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


వేడిచేయకూడని 5 ఆహారాలు

మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడని 5 ఆహారాలు:

బంగాళదుంప

చాలా మంది ఆలుగడ్డ కూరను చాలా ఇష్టంగా తింటుంటారు. అందుకే వారానికి రెండు మూడు సార్లైనా చాలా మంది ఇండ్లలో ఆలుగడ్డ కూర ఉంటుంది. కానీ ఆలుగడ్డ కూరను మళ్లీ వేడి చేసి తినకూడదు. ఎందుకంటే బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల దీన్ని ఎక్కువసేపు వండడం వల్ల అందులో అక్రిలామైడ్ ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ కు కారణమవుతుంది. అందుకే బంగాళా దుంప కూరను మళ్లీ వేడి చేయకూడదు. ఎక్కువ సేపు ఉడికించకూడదు. 

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసం చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఇవి ఎక్కువ పడితే అక్కడ దొరుకుతున్నాయి. అయితే ఈ మాంసం పాడవకుండా ఉండటానికి దీనిలో కెమికల్స్ ను వాడతారు. ఒకవేళ మీరు వీటిని వేడి చేసి తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 

వేడిచేయకూడని ఆహారాలు

చేపలు

చేపల కూరను కూడా మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడదు. చాలా మంది చేపల కూరను చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఒకేసారి చాలా మొత్తంలో వండేసి తర్వాతి పూటకు వేడి చేసి తింటుంటారు. కానీ చేపల కూరను వేడి చేసి అస్సలు తినకూడదు.

చేపల్లో ప్రోటీన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. చేపలను తింటే కళ్లు బాగా కనిపిస్తాయి. కానీ చేపల కూరను మళ్లీ మళ్లీ వేడి చేస్తే దాంట్లో ఉండే పోషకాలు లేకుండా పోతాయి. అలాగే ఈ కూర మీ శరీరానికి హాని చేస్తుంది. అందుకే చేపల కూరను చేసినప్పుడు దాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయకుండా ఉండండి. 

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్ ను మళ్లీ మళ్లీ వేడి చేసి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఈ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. వీటిని వేడి చేస్తే వాటిలో అక్రిలామైడ్ ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ కు కారణమవుతుంది. 

వంట నూనె

వంటనూనెను అస్సలు మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. ఒక్కసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడకూడదు. కానీ చాలా మంది డీప్ ఫ్రై చేసిన నూనెను తిరిగి కూరలకు, ఇతర వంటకు ఉపయోగిస్తుంటారు. కానీ నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తే దాంట్లో హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. ఇవి మనకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ను పెంచుతాయి. 

click me!