గుంత పునుగులు
గుంత పునుగులను తయారుచేయడం చాలా ఈజీ. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం మీరు మిగిలిపోయిన అన్నాన్ని, పెరుగును గ్రైండర్ లో బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు, మిరియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలపండి. వీటిని తయారుచేసే పాన్ ను స్టవ్ పై పెట్టండి. వీటిలో కొంచెం నూనె వేసి నూనెలో ఆవాలు, జీలకర్ర వేయండి. తర్వాత సిద్ధం చేసిన బియ్యం పిండిలో పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలపండి. ఇప్పుడు అప్పే మౌల్డ్ లో పిండి వేసి మూతపెట్టి రెండు వైపుల నుంచి బంగారు రంగులోకి మారే వరకు ఉడికించండి. అంతే వేడి వేడి గుంతపునుగులు రెడీ.