ఇండియాలో ఆయిల్ ఫుడ్ ను ఎక్కువగా తింటారు. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఏదో ఒక ఆయిలీ ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది. పూరీ, పకోడి, మిర్చి బజ్జీ, సమోసా, పునుగులు వంటివినూనెతోనే తయారవుతాయి. అయితే ఆహారంలో నూనె లేకపోతే ఫుడ్ టేస్టీగా ఉండదని చెప్తారు. కానీ ఈ నూనె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.ఇలాంటి పరిస్థితిలో నెల రోజుల పాటు నూనె లేని ఆహారాలను తింటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో అని ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఆరోగ్య నిపుణులు దీనిపై ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.