అంతేకాదు, శరీరానికి సరపడా సోడియం అందనట్లయితే, నీరు చేరి ఉబ్బినట్లుగా అయిపోతుంటారు. ఒక మనిషి శరీరంలో ఉండాల్సిన సోడియం సాధారణంగా పర్ లీటర్ కి 135 మిల్లిక్వివలెంట్స్ కంటే తక్కువగా ఉంటే దానిని హైపోనాట్రేమియా అంటారు. దీంతో కండరాలు, కణాలు ఉబ్బిపోతాయి. ఇక, రోజుకు కేవలం 2.4 గ్రాముల కంటే ఉప్పు తక్కువ తీసుకుంటే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో తరచూ తలనొప్పి, అలసట, మైకం, కళ్లు తిరగడం వంటి సమస్య ఏర్పడుతుంది.