పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలి?
నార్మల్ గా పల్లీ చట్నీ దాదాపు అందరూ చేసుకుంటూనే ఉంటారు. అయితే.. కేవలం ఒక దానిని అదనంగా చేర్చడం వల్ల చట్నీ రుచి పెరుగుతుంది. అదే జీడిపప్పు. పల్లీలతో పాటు కేవం 8 నుంచి 10 జీడిపప్పులను కూడా చేరిస్తే.. చట్నీ రుచి రెట్టింపు అవుతుంది.
కావలసిన పదార్థాలు
4 టీస్పూన్ల నూనె
3-4 పచ్చిమిర్చి
2-3 వెల్లుల్లి రెబ్బలు
8-10 జీడిపప్పులు
10-12 కరివేపాకు
1 కప్పు వేరుశనగపప్పు
1 టీస్పూన్ జీలకర్ర
రుచికి సరిపడా ఉప్పు
చిటికెడు ఆవాలు
తయారు చేసే విధానం
ముందుగా, ఏదైనా పాత్రలో పల్లీలు, జీడిపప్పు రెండింటినీ వేయించాలి. వీటిని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీలో కొద్దిగా నూనె వేసి
తరువాత 3-4 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రెండూ బాగా ఆరిన తర్వాత అందులో ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. సరిపడేంత నీరు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని నూనె వేసి కరివేపాకు, ఆవాలు, తాలింపు గింజలు వేసి.. తాళింపు పెట్టుకుంటే సరిపోతుంది. చట్నీ రుచి మాత్రం అదిరిపోతుంది.