ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ను తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అయితే చాలా మంది ఉదయాన్నే ఇడ్లీలు, దోశలను తింటుంటారు. పిల్లల నుంచి ఆఫీసులకు వెళ్లే వారికి వరకు ప్రతి ఒక్కరూ దోశలను, ఇడ్లీలను తినడానికి బాగా ఇష్టపడతారు.
వీటిని కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీతో తింటే బలే టేస్టీగా ఉంటుంది. అయితే చాలా సార్లు దోశ పిండి, ఇడ్లి పిండి రోజు మూడు రోజులు కూడా వస్తుంటుంది. కానీ ఇది రెండు రోజులకు మించి ఉంటే పిండి పుల్లగా పులిసిపోతుంది. ఇలాంటిపిండితో చేసిన దోశలను ఎవ్వరూ తినరు.
ఆ పిండిని ఏం చేయాలో తెలియక చాలా మంది దీన్ని పారేస్తుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో పులుపును తగ్గించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.