అయితే మనలో చాలా మంది సమయం లేక బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం బరువు తగ్గాలని ఉదయం ఏమీ తినరు. కానీ ఇలా ఉదయం ఏమీ తినకుండా ఉంటే మీ ఆరోగ్యం బాగా పాడవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితిలో బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పాలు, ఓట్స్ ను తీసుకోవడం చాలా మంచిది. ఇది హెల్తీ కాంబినేషన్. దీన్ని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది. అసలు ఓట్స్, పాలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.