దాదాపు ఎక్కువగా మామిడి కాయలు తొందరగా పండటానికి కాల్షియం కార్బైడ్ వాడుతూ ఉంటారు. ఇది మార్కెట్లో చాలా చీప్ గా దొరుకుతుంది. అందుకే.. ఎక్కువగా దీనిని వాడడుతూ ఉంటారు. కానీ.. ఇలా పండిన కాయలను తినడం వల్ల.. తలనొప్పి, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు.. అలాంటి పండు నోట్లో పెట్టుకోగానే.. నోరు మండినట్లుగా అనిపిస్తుంది. కొందరికైతే కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు కూడా అవుతూ ఉంటాయి.