ఆరోగ్యానికి మంచిది కాదని.. చాలా మంది మైదా ను వాడరు. కేవలం.. గోధుమ పిండి తోనే చేస్తారు. కానీ.. మైదాతో చేసినంత రుచి.. అచ్చంగా గోధుమ పిండితో చేస్తే రాదు. అయితే... 750 గ్రాముల గోధుమ పిండిలో.. 250 గ్రాముల మైదా పిండి కలిపి.. అప్పుడు.. పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల.. పూరీ రుచి బాగా పెరుగుతుంది. మనం కలిపే మైదా పిండి శాతం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి..ఆరోగ్యానికి వచ్చిన ఢోకా కూడా ఉండదు. ఇలా ఈ రెండూ కలిపి చేయడం వల్ల.. పూరీలు చాలా మెత్తగా, రుచిగా ఉంటాయి.