పసుపును మనం ప్రతిరోజూ కూరల్లో వేస్తూనే ఉంటాం. ఇది కూరలకు మంచి రంగును ఇచ్చినా.. మన ఆరోగ్యానికి మాత్రం ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. పసుపులో దివ్య ఔషధ గుణాలు దాగున్నాయి. దీనిని ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. పసుపును ఉపయోగించి శరీర మంట నుంచి ఆక్సీకరణ ఒత్తిడి వరకు ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే పసుపును ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. పసుపు ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా సహాయపడుతుంది. ఇక ప్రతిరోజూ పడుకునే మందు గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసుకుని తాగితే హాయిగా నిద్రపట్టడంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే పసుపును మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కానీ దీన్ని హెవీగా ఉపయోగిస్తేనే ఎన్నో సమస్యలు వస్తాయి. పసుపులో ఐరన్, జింక్, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, రాగి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మరి ఈ పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.