దేశంలో డయాబెటిస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. భారతీయ జనాభాలో మధుమేహలు సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల భారతదేశాన్ని "డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్" అని పిలుస్తారు. జెనెటిక్స్, నిశ్చల జీవనశైలి, పేలవమైన ఆహారపు అలవాట్లు, పట్టణీకరణ వంటి వివిధ కారణాల వల్ల దేశంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.