ఈ నీర్ దోశ తయారీకి మనం ఎలాంటి పప్పులు వాడాల్సిన అవసరం లేదు. బియ్యం, పచ్చి కొబ్బరీ ఉంటే చాలు. నానపెట్టిన బియ్యంలో పచ్చి కొబ్బరి వేసి.. మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో నీరు పోసి, ఉప్పు కలుపుకుంటే పిండి తయారైనట్లే. సాధారణ దోశెల కంటే నీర్ దోశెకి నీళ్ళు ఎక్కువ కావాలి. మిశ్రమం పలుచగా ఉండాలి. కావలసినన్ని నీళ్ళు పోయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని పక్కన పెట్టి, తవ్వ వేడి చేసి, నూనె వేయాలి.