అయితే పిడుగు పడటం వల్ల విమానానికి ఎలాంటి ప్రభావం ఉండదని పూర్తిగా చెప్పలేం. కొన్ని సందర్భాల్లో విమానం రెక్కలు విరిగిపోవచ్చు లేదా ముక్కు భాగం లో మంటలు అంటుకోవచ్చు. ఒక్కొక్కసారి నావిగేషన్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ పరికరాలపై కూడా ప్రభావం చూపించవచ్చు. అప్పుడు అవి పని చేయకుండా ఆగిపోవచ్చు. అయితే పిడుగు తగిలిన తర్వాత విమానం గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే ఇంజనీర్లు విమానం మొత్తాన్ని పరిశీలిస్తారు. ఎక్కడైతే తీవ్రమైన నష్టం జరుగుతుందో దానికి మరమ్మతులు చేస్తారు. కాబట్టి ప్రయాణికులు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని విమానయాన నిపుణులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులను ముందుగానే రాడార్ వ్యవస్థలు గుర్తిస్తాయి. విమానం ప్రయాణిస్తున్న మార్గంలో వాతావరణం ఎలా ఉందో అంచనా వేసే చెబుతాయి. భారీ తుపానులు ఉన్నచోట పైలెట్లు ఆ మార్గాన్ని తప్పించే ప్రయత్నం చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా విమానాల్లో అనేక భద్రత వ్యవస్థలే పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఎన్నో విమానాలు ప్రతిరోజు వర్షాలు మేఘాలు, పిడుగులు, ఉరుములు మధ్య కూడా తమ ప్రయాణాన్ని పూర్తిచేస్తాయి.